నెల్లిమర్లలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు

నెల్లిమర్ల, శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక స్వామి మహోత్సవాలు సందర్భంగా శుక్రవారం జోగిరాజుపేట గ్రామంలో భారీ ఎత్తున నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి లోకం మాధవి సహకారంతో 2000 మందికి అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 2000 మంది గ్రామ ప్రజలు పాల్గొని భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో నెల్లిమర్ల మండలం జనసేన వీర మహిళ గిడిజాల హైమ, జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.