జనసేన ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్

తుని, తొండంగి మండలం గోర్షపాలెం జనసైనికుడు బద్ది సతీష్ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్ ప్రారంభించడానికి జనసేన తొండంగి మండల అధ్యక్షులు బెండపూడి నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించి పోటీల్లో పాల్గొనే జట్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తొండంగి మండల ఉపాధ్యక్షులు ఖండవలి గణేష్, అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి దుర్గాప్రసాద్, తొండంగి యూత్ ప్రెసిడెంట్ బద్ది శివ, గోర్షపాలెం జనసైనికులు యదల శ్రీను, నరసింహమూర్తి, యనమల గోపికృష్ణ మరియు జనసేన యూత్ సభ్యులు పాల్గొన్నారు.