దేశ ప్రజలందరికి సంక్రాంతి శుభాకాంక్షలు: రాష్ట్రపతి
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దేశ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘దేశ పౌరులందరికీ లోహ్రీ, మకర సంక్రాంతి, పొంగల్, భోగాలి బిహు, ఉత్తరాయణ్, పౌష్ పర్వ శుభాకాంక్షలు. ఈ పండుగ మన సమాజంలో ప్రేమానురాగాలను, శాంతి సామరస్యాలను మరింత బలపడేందుకు తోడ్పడాలి. దేశంలో భోగభాగ్యాలను, సుఖసంతోషాలను పెంపొందించాలి’ అని రాష్ట్రపతి రామ్నాథ్ తన ప్రకటనలో పేర్కొన్నారు.