కరెంట్ బిల్ పెంచిన జగన్ ప్రభుత్వంపై యుద్ధానికి మేము సిద్ధమే

కాకినాడ సిటి: జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో సిటీ సహాయ కార్యదర్శి మిరియాల హైమావతి ఆధ్వర్యంలో 36వ డివిజన్ గంజాం వారి వీధి ప్రాంతంలో కరెంట్ బిల్ పెంచిన జగన్ ప్రభుత్వంపై యుద్ధానికి మేము సిద్ధమే అనే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ముత్తా శశిధర్ మాట్లాడుతూ ఈ అయిదేళ్ళ వై.సి.పి పాలనలో జగన్మోహన్ రెడ్డి 8 సార్లు కరెంటు ధరలను పెంచాడనీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే విధమై బాడుడే బాదుడు అని గొంతుచించుకుంటూ రాగాలు తీస్తే అదంతా పేదల మీద ప్రేమ అనుకుని మోసపోయామని ఇప్పుడు ప్రజలు గుర్తించారన్నారు. పొనీ ఇది ఇక్కడితో వదిలాడా అంటే వదలకుండా కరెంటు బిల్లులతో సంక్షేమ పధకాల లబ్దిదారుల అర్హతను ముడిపెట్టాడనీ, ప్రతి సంక్ష్యేమ పధకంకీ లంకె వేసి జాబితాలోంచి అర్హులను కుదించేసాడనీ అంతా మోసమే తప్ప పేదలు బాగుపడింది లేదని విమర్శించారు. రాబోయే జనసేన తెలుగుదేశం ఉమ్మడి కూటమిని ఎన్నుకుని తద్వారా ఏర్పడే ప్రజా ప్రభుత్వంలో మెరుగైన పాలన పొందుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ, సిటీ ఉపాధ్యక్షులు అడబాల సత్యనారాయణ, మిరియాల వీరనారాయణ రావు, సాధనాల గంగాధర్, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.