కొత్త చరిత్రను లిఖించాం.. ‘100కోట్ల ఘనత’పై మోదీ
కరోనాపై పోరాటంలో ఇండియా అసాధారణ మైలురాయిని అందుకున్నది. నేటి వరకు దేశవ్యాప్తంగా వంద కోట్ల కోవిడ్ టీకా డోసులను పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఇండియా చరిత్ర సృష్టించినట్లు ఆయన తన ట్విట్టర్ అకౌంట్లో పేర్కొన్నారు. భారతీయ సైన్సు, వ్యాపారంతో పాటు 130 కోట్ల మంది భారతీయుల స్పూర్తికి ఇది సాక్ష్యమని ఆయన అన్నారు. వ్యాక్సినేషన్లో వంద కోట్లు దాటిన నేపథ్యంలో దేశ ప్రజలకు ఆయన కంగ్రాట్స్ తెలిపారు. ఈ అద్భుతమైన ఘనత సాధన కోసం కృషి చేసిన డాక్టర్లు, నర్సులు, అందరికీ ఆయన కృతజ్ఞతలు చెప్పారు. వ్యాక్సిన్ డోసుల పంపిణీ వంద కోట్ల మార్క్ దాటిన నేపథ్యంలో ఇవాళ ప్రధాని మోదీ ఢిల్లీలోని ఆర్ఎంఎల్ హాస్పిటల్కు వెళ్లారు. అక్కడ ఆయన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు.
![](https://assets-news-bcdn.dailyhunt.in/cmd/resize/400x400_80/fetchdata16/images/16/61/bc/1661bc37631cca3b4f1c63024816cc02672d1f150f1e04a83e10e23aa124a87b.jpg)
![](https://assets-news-bcdn.dailyhunt.in/cmd/resize/400x400_80/fetchdata16/images/bc/fd/a8/bcfda8f97b1855513c35cadbbea83b12e674fc6baae2a0e37fb5729bbab107a5.jpg)