మన చుట్టూ ఉన్న ప్రజలకు అండగా ఉండాలి: పవన్‌ కళ్యాణ్

ఇటీవల జనసేన తెలంగాణ విభాగం యువజ, విద్యార్థి కమిటీలు నియమించింది. అయితే తాజాగా మంగళవారం ఈ కమిటీల అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులతో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. యువకులు, విద్యార్థులు రాజకీయ చైతన్యంతో ముందుకు వెళ్ళి ప్రజలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. మన చుట్టూ ఉన్న ప్రజల కోసం బలంగా నిలబడి గొంతు వినిపించాలన్నారు. ఆ ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా పని చేయాలని సూచించారు. సమస్యల పరిష్కారంలో జనసేన పార్టీ తరఫున అందరం క్రియాశీలకంగా వ్యవహరించాలని వెల్లడించారు. ”పాలమూరు రైతులు, కూలీల ఇబ్బందులు కావచ్చు… ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా స్పందిద్దాం. మన వంతుగా మనం అండనిచ్చి నిలబడదాం. ఎప్పటికప్పుడు కమిటీలతో సమావేశం అయి చర్చిద్దాం” అని నేతలను పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు.