త్వరలో కొత్త ఐటీ పాలసీ తీసుకువస్తాం: కేటీఆర్

ఐటి పాలసీ కి ఐదు సంవత్సరాలు పూర్తి కానున్న నేపథ్యంలో ఐటీ శాఖ పైన సమీక్ష నిర్వహించారు మంత్రి కేటీఆర్ త్వరలో నూతన ఐటీ పాలసీని తీసుకువస్తామని ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మరిన్ని పెట్టుబడులు, మరిన్ని ఉపాధి అవకాశాలు లక్ష్యంగా నూతన ఐటీ పాలసీ తీసుకువస్తున్నామన్న ఆయన తెలంగాణ ఐటీ పాలసీ అద్భుతమైన ఫలితాలను అందించిందని అన్నారు. ప్రజలకు మరిన్ని ప్రభుత్వ సేవలు పొందే విధంగా ఎలక్ట్రానిక్ సర్వీస్ విభాగం బలోపేతం చేస్తామని ఆయన అన్నారు. పౌరుడి సౌకర్యం, సంక్షేమమే లక్ష్యంగా మరిన్ని ఆన్లైన్, మొబైల్ ప్రభుత్వ సేవలు చేపట్టనున్నామని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావడంలో విజయం సాధించామని ఆయన అన్నారు.