దోస్త్ రిజిస్ట్రేషన్లకు రేపటి వరకు గడువు

డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు అధికారులు మరో అవకాశం కల్పించారు. దీనికోసం రేపటివరకు కొత్తగా రిజిస్ర్టేషన్లు చేసుకోవచ్చని దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. దీంతోపాటు వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకోవాలని సూచించారు. గతంలో, స్పెషల్‌ డ్రైవ్‌లో సీట్లుపొందిన విద్యార్థులు రేపటిలోగా కాలేజీల్లో సెల్ఫ్‌ రిపోర్టింగ్ చేసుకోవాలని చెప్పారు. ఈ నెల 18న వెకెన్సీ-సీట్స్‌ డ్రైవ్‌ కౌన్సెలింగ్‌ సీట్లు కేటాయిస్తారు. ఇందులో సీట్లు పొందినవారు కాలేజీల్లో రిపోర్టుచేయడానికి ఈ నెల 19 వరకు గడువు విధించారు. ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 18, 19 తేదీల్లో స్పాట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు.