అన్ని పంచాయతీలలో ప్రచార కార్యక్రమం నిర్వహిస్తాం

మదనపల్లి జనసేన కార్యాలయంలో మదనపల్లి జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులుని అదే విధంగా చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు నా సేన కోసం నా వంతు కమిటీ కార్యవర్గ సభ్యులు శ్రీమతి దారం అనిత, మదనపల్లి సీనియర్ నాయకులు దారం హరి ప్రసాద్ ని మర్యాదపూర్వకంగా మదనపల్లి పట్టణ అధ్యక్షులు నాయిని జగదీష్ బాబు ఆధ్వర్యంలో కలిసిన రామసముద్రం మండలం దీన్నిపల్లె, గొల్లపల్లి, గురజాల పంచాయతీల జనసేన నాయకులు జనార్ధన్, మంజునాధ్, సురేష్, కుమార్, జయరాజ్, చలపతి, రామాంజులు, కృష్ణ, అఖిలేష్ తదితరులు. ఈ సందర్భంగా వారు తమ పంచాయతీల్లో కూడా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రజల నుండి స్పందన చాలా బాగుందని జనసేన-టిడిపి కలిసి ఈసారి జనసేన-టిడిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ముక్తకంఠంతో ప్రజలే చెప్తున్నారని రామాంజనేయులుకి వివరించడం జరిగింది. దీనికి స్పందించిన రామాంజనేయులు తొందరలోనే రామసముద్రం మండలంలోని అన్ని పంచాయతీలలో ప్రచార కార్యక్రమం నిర్వహిస్తామని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు కోటకొండ చంద్రశేఖర్, గల్లా అనిల్, హర్ష, సోను, గంగాధర్ ధరణి, నవాజ్ తదితరులు పాల్గొన్నారు.