వాడ వాడలో జనసేన జెండా ఎగరేస్తాం, భవిష్యత్ తరాలు మార్చే పార్టీ జనసేన పార్టీ: గాదె

తాడికొండ నియోజకవర్గం, తాడికొండ మండలం రావెల గ్రామంలో జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరావు ముఖ్యఅతిథిగా పాల్గొని వారి ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి తర్వాత జనసేన పార్టీ జండా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా గాదె మాట్లాడుతూ… రావెల గ్రామంలో అధికార పార్టీకి ధైర్యంగా ఎదురు నిలబడిన జనసైనికులకి అండగా ఉంటామని భరోసా ఇస్తున్నానని అలాగే ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన ప్రతి ఒక్క జనసైనికునికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. పార్టీ జెండా వీధి, వీధిలో ఎగరేసి భవిష్యత్తు రాజకీయంలో మన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా ప్రతి ఒక్క జనసైనికులు కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. ఇలాంటి కార్యక్రమానికి ముందుండి నడిపిస్తున్న ప్రతి ఒక్క జనసైనికునికి నా పాదాభివందనం అని తెలియజేశారు. తరువాత కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రతి ఒక్కరిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అడపా మాణిక్యాలరావు, నారదాసు రామచంద్ర ప్రసాద్, కొర్రపాటి నాగేశ్వరరావు, మండల అధ్యక్షుడు గోలకవరపు నరేష్, ఫిరంగిపురం, మేడికొండూరు మండల నాయకులు వెంకట్రావు, వీరేంద్ర, సురేష్, నాగబాబు, నాయక్, ప్రసాద్, విజయ్, అల్లం రమేష్ తదితరులు పాల్గొన్నారు.