ఉగాది వేడుకలలో పాల్గొన్న అక్కల రామ మోహన రావు

మైలవరం: కొండపల్లి శ్రీ సిద్ధి వినాయక గుడి నందు తెలుగు నూతన సంవత్సర శ్రీ శోభకృత్ నామ సంవత్సర వేడుకలలో భాగంగా ఘనంగా పూజలు హోమాలు నిర్వహించి, కొత్త సంవత్సరం పంచాంగం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అక్కల రామ మోహన రావు (గాంధి), కమిటీ సభ్యులు గుడుపాటి హరి కృష్ణా, మానస రమణ, శ్రీనాథ్, గ్రామం పెద్దలు తదితరులు పాల్గొన్నరు.