చలివేంద్రి రైతులకు జనసేన తరఫున అండగా ఉంటాం.. గర్భాన సత్తిబాబు, కోరంగి నాగేశ్వరావు

పాలకొండ నియోజకవర్గం, జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు, కోరంగి నాగేశ్వరరావు చలివేంద్ర గ్రామంలోని రైతులను పరామర్శించారు. ఈ సందర్హంగా రైతులు తాము పండించిన ధాన్యం కొనుగోలు జరగలేదని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా గర్భాన సత్తిబాబు మీడియాతో మాట్లాడుతూ… ధాన్యం కొనుగోలు జరిగే వరకు రైతులకు జనసేన పార్టీ తరఫున పోరాటం సాగిస్తామని వారికి అండగా నిలుస్తామని అన్నారు. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి రైతులు అంటే అమితమైన గౌరవం అని, వారి విషయమై అధినేత ఎంత దూరమైన వెళ్తారని, కోరంగి నాగేశ్వరరావు అన్నారు. కార్యక్రమంలో వీరఘట్టం మండలం నాయకులు సతివాడ వెంకటరమణ, మత్స్య పుండరీకం వజ్రగడ రవి కుమార్ (జానీ), గర్భాపు నరేంద్ర, జల్లు సొంబాబు, యడ్ల రమేష్, సంతోష్, జామీ రాంబాబు, సుమన్ పాల్గొన్నారు.