టి. వెంకటాపురంలో హోరేత్తిన జనసేన గ్రామబాట..

తుని నియోజకవర్గం, టి వెంకటాపురం గ్రామంలో మండల అధ్యక్షులు వెంకటరమణ, గ్రామ వీరమహిళ పోతిన సత్యవతి, గుర్రం శ్రీను ఆధ్వర్యంలో బుధవారం గ్రామబాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆ గ్రామంలో ఉన్న అనేక సమస్యలు అడిగి తెలుసుకోవటం జరిగింది. గ్రామంలో ఉన్న ప్రధాన సమస్య డ్రైనేజి సమస్య. డ్రైనేజి కాలువలు సరిగా లేక ఇళ్ళముందు మురికి పేరుకుపోయి అక్కడ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి కచ్చితంగా పరిష్కరిస్తామని జనసేన నాయకులు బరోసా ఇచ్చారు. గ్రామ మహిళలు రాబోయే ఎన్నికలలో మేమందరం జనసేన పార్టీకి ఓటు వేసి, జనసేనకు మద్దతిస్తామని తెలియజేసారు. వారి నుండి వచ్చిన విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రంలో రాష్ట్ర మత్సకార సభ్యులు చొక్కా కాశీ, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జాయింట్ సెక్రటరీ పలివెల లోవరాజు, మండల వైస్ ప్రెసిడెంట్ నిమ్మల లోవసూరిబాబు, లట్టాల నాగేశ్వరావు, మర్రి వీరబాబు, బొప్పన రాము, అద్దేపల్లి బాలాజీ, ఉప్పలపాటి సీతారామరాజు, ముక్కారపు శివ కర్రి ప్రసాద్, గెడ్డమూరి సురేష్, నల్లాల దుర్గాప్రసాద్, బద్రి శివ, నక్కా శ్రీనుబాబు మరియు నియోజకవర్గం జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొనటం జరిగింది.