పయ్యావుల కేశవ్ గెలుపుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తాం – గౌతమ్ కుమార్

ఉరవకొండ, జనసేన ఇంచార్జ్ గౌతం కుమార్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు సీట్లు ప్రకటించిన జాబితాలో జనసేన-టిడిపి ఉమ్మడి అభ్యర్థిగా ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్ ని ప్రకటించడం సంతోషకరమని, ఉరవకొండ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ మండల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ సమిష్టితో, వచ్చే సార్వత్రిక ఎన్నికలలో అఖండ మెజారిటీతో కేశవ్ గెలవడం ఖాయం అన్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో పయ్యావుల కేశవ్ ని భారీ మెజారిటీతో గెలిపించి మరొకసారి అసెంబ్లీలో తన గళం వినిపించడానికి జనసైనికులు అందరూ తమ వంతు కృషి చేయాలని విలేకరుల సమావేశంలో తెలియజేశారు.