బడ్జెట్‌లో ఏ వస్తువుల ధరలు పెరిగేవి..తగ్గేవి!

కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ఆశాజనకంగా లేదనే విమర్శలు వస్తున్నాయి. అధికశాతం వస్తువుల ధరలు పెరగనుండగా..కొన్ని వస్తువుల ధరలు మాత్రం తగ్గనున్నాయి. ఏయే ధరలు పెరగనున్నాయి..ఏయే ధరలు తగ్గనున్నాయనేది పరిశీలిద్దాం..

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రభావం ధరల పై స్పష్టంగా కన్పించనుంది. కాటన్‌పై పది శాతం కస్టమ్స్స డ్యూటీ పెరగడంతో దిగుమతి చేసుకునే ప్రీమియం దుస్తులు మరింత ప్రియం కానున్నాయి. అటు లెదర్ ఉత్పత్తులు, సోలార్ ఇన్వెర్టర్ల ధరలు కూడా పెరగనున్నాయి. ఇక బడ్జెట్ లో ఆటోమొబైల్ రంగానికి సంబంధించి కస్టమ్ డ్యూటీ పెంపు కారణంగా కార్ల విడిభాగాల ధరలు పెరగబోతున్నాయి. ఇక బంగారం, వెండి ధరలు తగ్గనున్నాయి. అటు రాగిపై పన్ను మినహాయింపు ఇచ్చింది కేంద్రం. అక్టోబర్ 21 నుంచి కొత్త కస్టమ్ పాలసీ అమల్లో రానుంది.

ధరలు పెరగనున్న వస్తువులు

ఎలక్ట్రానిక్‌ వస్తువులు, మొబైల్‌ ఫోన్లు ( ఇంపోర్టు డ్యూటీ 2.5 పెంపు ), చెప్పులు, పర్సులు, చార్జర్స్‌ వంటి మొబైల్ విడిభాగాలు, సింథటిక్‌ జెమ్‌స్టోన్స్‌, లెదర్‌ ఉత్పత్తులు, సోలార్‌ ఇర్టర్లు, సోలార్‌ లాంతర్లు, ఆటో విడిభాగాలు, స్టీలు స్క్రూలు, కాటన్‌, రా సిల్స్‌, యాన్‌ సిల్క్‌, ఆల్కహాలిక్‌ బీవరైజెస్‌, క్రూడ్‌ పామాయిల్‌, క్రూడ్​ సోయాబీన్‌, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌, ఆపిల్స్‌, బొగ్గు, లిగ్నైట్‌, పిట్‌ యూరియా తదితర ఫర్టిలైజర్లు, బఠాణీలు, కాబూలీ శెనగలు, బెంగాల్‌ గ్రాం పప్పులు

ధరలు తగ్గుతున్న వస్తువులు

ఐరన్‌, స్టీలు, నైలాన్‌ దుస్తులు, నైలాన్‌ ఫైబర్‌, కాపర్‌ వస్తువులు, ఇన్సూరెన్స్‌, షూస్‌, బంగారం, వెండి ధరలు, నాఫ్తా