కరోనాపై ప్రభుత్వానికి ఎందుకు ఇంత నిర్లక్ష్యo .. హైకోర్టు

తెలంగాణా రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై విచారణ సందర్భంగా ప్రభుత్వ తీరుపై హైకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం తరపున విచారణకు హాజరైన సీఎస్‌ సోమేష్‌కుమార్‌ ఆయన పై హైకోర్టు సీరియస్ అయ్యింది. గతంలో ఇచ్చిన ఆదేశాలు ఏ ఒక్కటి అమలు కాలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. కరోనాపై ఎందుకు ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యమని ప్రశ్నించింది. కరోనా చికిత్స అంశంలో ప్రైవేటు ఆస్పత్రులు ప్రజలను పీడిస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని న్యాయస్థానం ప్రశ్నించింది. అయితే ఇప్పటివరకు 50 మందికి నోటిసులు ఇచ్చామని సోమేష్‌కుమార్‌ కోర్టుకు తెలిపారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రుల లైసెన్స్‌ రద్దు చేశామని చెప్పారు. దీంతో మిగిలిన ఆస్పత్రుల పరిస్థితి ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. వాదనలు ఇంకా కొనసాగుతున్నాయి.