జనసేన బలోపేతానికి కృషి చేస్తా: మాధవ రెడ్డి

శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జిగా నియమితులైన డాక్టర్ మాధవరెడ్డిని జనసేన పార్టీ కార్యకర్తలు మర్యాపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేసారు. ఈ సందర్భంగా మాధవ రెడ్డి మాట్లాడుతూ..నాకు ఈ బాధ్యత అప్పగిఒచినఒదుకు జనసేన పార్టీ సిద్ధాంతానికి అంకిత భావంతో నీతి, నిజాయితి, నిబద్దత, క్రమశిక్షణ, చిత్త శుద్ధితో పని చేస్తాననీ అలాగే ప్రజా సమస్యల పట్ల అలుపెరగని పోరాటం చేసి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ అన్ని కార్యాక్రమాలలో చురుగ్గా పాల్గొని, ప్రజలు ఎదురుకొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తానని, జనసేన పార్టీలో నమ్మిన సిద్ధాంతానికి అహర్నిశలు కృషి చేసి పార్టీ బలోపేతానికి కృషి చేసి నాకు అప్పగించిన ఈ పదవి మరింత బాధ్యత పెంచిందని తెలియ చేస్తూ రాబోయే రోజుల్లో జనసేన పార్టీ కచ్చితంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో జనసేన సత్తా చాటుతుందని తెలిపారు, ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన నాయకులు అరుణ్, సరోజ్ప్రదీప్, రమేష్, కళ్యాణ్ చక్రవర్తి, ప్రవీణ్ సాహు, జి.ఎస్.కే శ్రావణ్ కుమార్, ఉపేంద్ర, నరేష్, రోహిత్, ప్రకాష్, పవన్, శ్రావణ్, లక్ష్మి నారాయణ మరియు జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.