నల్లచెరువు మండలంలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ లో విన్నర్ గుంజువారి పల్లి టీం, రన్నర్ నల్లచెరువు టీం

నల్లచెరువు మండలంలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ కు ముఖ్య అతిధులుగా జనసేనపార్టీ ఎంపిటిసి అమర్ కార్తికేయ వెళ్లడం జరిగింది. 39 టీం లు పాల్గొని ఫైనల్ కు తనకల్లు గుంజువారి పల్లి/నల్లచెరువు టీం లు రాగా విన్నర్ గుంజువారి పల్లి టీం, రన్నర్ నల్లచెరువు. విన్నర్స్ కు, రన్నర్స్ కు, మాన్ ఆఫ్ ది మాచ్, మాన్ ఆఫ్ ది సిరీస్ మరియు బెస్ట్ బాట్స్ మాన్ లకు ట్రోఫితో పాటు ప్రైజ్ మనీని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ ఆర్గనైజింగ్, క్రీడాకారులు,మండల నాయకులు పాళ్యం సుధాకర్, హరనాథ్ రెడ్డి, సతీష్, జిలాన్, సిద్దు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.