నాదెండ్లను ఘనంగా స్వాగతించిన జనసేన శ్రేణులు

తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రాజమండ్రి విచ్చేసిన జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ కు రాష్ర్ట సీనియర్ నాయకులు వై.శ్రీనీవాస్ స్ధానిక షెల్టాన్ హోటల్లో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వై.శ్రీనివాస్, జిల్లా, మరియు నగర నాయకులు, కార్యకర్తలతో నాదెండ్ల, జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్ జిల్లా బలోపేతంపై ముఖ్య విషయాలు చర్చించారు. నాదెండ్లను కలసిన వారిలో రాష్ర్ట లీగల్ సెల్ ఉపాధ్యక్షులు రామచంద్రరావు, జిల్లా కార్యదర్శులు తేజోమూర్తుల నరసింహమూర్తి,జామి సత్యనారాయణ, నగర సీనియర్ నాయకులు గురునాధరావు,ప్రకాష్, షేక్ భాషా, చలపతి , ముమ్ముడి నాగరాజు,ఇందిరా, ముమ్ముడి లక్ష్మీ, తేజస్విని, సతీష్ తదితరులు ఉన్నారు.