కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి ఆర్ధిక సాయమందించిన యర్రవరం జనసేన

ప్రత్తిపాడు నియోజకవర్గ ఇంచార్జి వరుపుల తమ్మయ్య బాబు ఆదేశాలతో ఏలేశ్వరం మండలం యర్రవరం గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డా.బి ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పుష్పమాల వేసి 131వ జయంతి శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం ఎర్రవరం జనసైనికుల ఆధ్వర్యంలో స్థానికంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న పండు అనే వ్యక్తికి 7000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం మండల అధ్యక్షులు పెంటకోట మోహన్, జిల్లా కార్యదర్శి నల్లల రామకృష్ణ జాయింట్ సెక్రటరీ దాసం శేషారావు, యువ నాయకులు సాయి, ఏలేశ్వరం మండల వైస్ ప్రెసిడెంట్ పలివెల వెంకటేష్, దుర్గా ప్రసాద్, నాని మరియు యర్రవరం గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.