పార్వతీపురంలో వైసీపీ అభివృద్ధి పనులన్నీ పేపర్స్ వరకే – పిసిని చంద్రమోహన్

  • పార్వతీపురం డంపింగ్ యార్డ్ సమస్య తీరుస్తాం అని మాటతప్పిన వైసీపీ
  • జనసేన – టీడీపీ గెలుపు ఆపడం ఎవరితరం కాదు
  • జనసేన రాష్ట్ర కార్యదర్శి “పిసిని చంద్రమోహన్” గారిని ఘనస్వాగతం పలికిన పార్వతీపురం జనసేనపార్టీ నాయకులు

పార్వతీపురం నియోజకవర్గం: మంగళవారం జనసేన పార్టీ నాయకులు ఆధ్వర్యంలో జరిగిన జనసేన పార్టీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి “పిసిని చంద్రమోహన్” ముఖ్య అతిథిగా రావడంతో జనసేన నాయకులు సీతానగరం మండల అధ్యక్షులు పాటి శ్రీను, సీనియర్ నాయకులు నెయ్యిగాపుల సురేష్, రాజాన రాంబాబు, సిరిపురపు గౌరీ, మానేపల్లి ప్రవీణ్, భమిడిపాటి చైతన్య, కడగల శ్యాంసుందర్, రేవల దుర్గా, శివారెడ్డి, పైలా శ్రీను, కొల్లిపర తేజ తదితరులు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో పలు అంశాలపై చర్చించుకున్నారు. దానిలో ముఖ్యమైన అంశం పార్వతీపురం అభివృద్ధి. అనంతరం రాష్ట్ర కార్యదర్శి పిసిని చంద్రమోహన్ మాట్లాడుతూ.. పార్వతీపురంలో వైసీపీ అభివృద్ధి పనులన్నీ పేపర్స్ వరుకే అని ఏద్దేవచేసారు. డంపింగ్ యార్డ్ సమస్య, వాటర్ సమస్య అధికారం లోకి రాగానే తీరుస్తాం అని 2019 ఎన్నికల ముందు వైఎస్ జగన్ మాటిచ్చి మాట తప్పరు అలాగే ఇక్కడ ఎమ్మెల్యే అలజంగి జోగారావు వచ్చి 5సంవత్సరాలు కాలయాపన చేస్తూ సొంత ప్రయోజనాలుకోసము, పబ్లిసిటీిల కోసమే తప్పా పార్వతీపురం ప్రజలకోసం మాత్రం ఆయనికి పట్టదు అని అన్నారు. 2024లో ఈ వైసీపీ గద్దె దించడం కాయం అని అలాగే జనసేన – టీడీపీ గెలుపు ఆపడం ఎవరితరం కాదు అని చెప్పి ముగించారు. ఈ కార్యక్రమంలో కురుపాం నియోజకవర్గం నాయకులుశ్రీరామ్, శివ, రాజా తదితరులు పాల్గొన్నారు.