వైసీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది: పెంటేల బాలాజి

చిలకలూరిపేట: నాదెండ్ల మండలం, గణపవరం గ్రామంలో 1వ వార్డు అంబేద్కర్ కాలనీలో శనివారం జనసేన కార్యకర్తలు నాయకులు కలిసి జనసేన జెండా ప్రతిష్ట చేయటం అందరికి తెలిసిన విషయమే. వైస్సార్ సీపీ నాయకుని సంతలో పనిచేసే ముసలయ్య, అతని కుమారులు మధు, వార్డు వాలంటీర్ అశోక్, పూర్ణయ్య కలిసి జెండా దిమ్మెన పగలకొట్టి వైసిపీ యువ నాయకునికి పడగిట్టినట్లుగా సమాచారం అంధించి పరారీ అయ్యారు, ఇది తెలుసుకుని ఆ వార్డు జనసేన నాయకులు పెద్దలు అడగటానికి వెళ్లి చుస్తే వారు పరారిలో ఉన్నారని తెలిసింది. మీరు చేయించలేదు అని ఖండించాలి అంటే ముందుగా యువ నాయకుని కాల్ లిస్ట్, జెండా పడేసిన వాళ్ళ కాల్ లిస్ట్ మీడియా ముఖంగా అందించి మీ నిజాయితీ నిరూపించుకోవాలి అని పెంటేల బాలాజి డిమాండ్ చేసారు. ఈ విషయంపై జనసేన నాయకులు పెంటేల బాలాజి నాదెండ్ల ఎస్ ఐకి సమాచారం అందించారు. పెంటేల బాలాజి మాట్లాడుతూ వైసీపీ మంత్రి విడదల రజనికి ఓటమి భయం పట్టుకుందని రోజు రోజుకి వైసీపీ పార్టీ మరియు చిలకలూరిపేట నియోజకవర్గంలో మంత్రిపై వస్తున్న వ్యతిరేకత తట్టుకోలేక వార్డుల్లో, గ్రామాల్లో బెదిరింపులకు, దాడులకు దిగుతున్నారని అన్నారు. మీ పౌరుషం అభివృద్ధిలో చూపించాలే కానీ ఇలా జనసేన పార్టీ జెండాలపై, కార్యకర్తలపై కాదని, ఈ నాలుగున్నర సంవత్సరాలనుండి చిలకలూరిపేట నియోజకవర్గం మీరు చేసిన అభివృద్ధి ఏంటో బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేసారు. మీరు చిలకలూరిపేట నియోజకవర్గంలో శాశ్వత ఎమ్మెల్యే కాదు, ప్రజలు మీ దౌర్జన్యం చూస్తూనే ఉన్నారని దీనిపై పోలీస్ వారు నిష్పక్షపాతంగా చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ నియోజకవర్గం నాయకులు పెంటేల బాలాజి డిమాండ్ చేసారు.