హుస్నాబాద్ నియోజకవర్గ జనసేన ఆధ్వర్యంలో జనసేనాని జన్మదిన వేడుకలు

హుస్నాబాద్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని శనివారం హుస్నాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ తగరపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం శ్రీ పాటిమీది ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత వేడుకల సమావేశం శ్రీ రాజరాజేశ్వరీ పంక్షన్ హల్ లో ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి తగరపు శ్రీనివాస్ మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలని, అభిమానులు కార్యకర్తలుగా మారి, పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేయాలని అన్నారు. అనంతరం పెద్ద ఎత్తున బైక్ ర్యాలీతో వెళ్లి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, జనసేన జెండాను ఆవిష్కరించారు. తర్వాత వేడుకల అనంతరం నియోజకవర్గంలోని ఎల్కతుర్తి మండలంలో నూతన జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్ తగరపు శ్రీనివాస్ మరియు హుస్నాబాద్ మండల అధ్యక్షుడు మల్లెల సంతోష్, ఉపాధ్యక్షుడు కొలుగూరి అనిల్, ప్రధాన కార్యదర్శి గాలిపెల్లి వినోద్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ తోడేటి సంపత్, సోషల్ మీడియా సెక్రెటరీ రెడ్డి గోపినాథ్, పట్టణ నాయకులు మోరె శ్రీకాంత్, నేవూరి పవన్, సైదాపూర్ మండల అధ్యక్షుడు పొడిశెట్టి విజయ్, ఎల్కతుర్తి మండల అధ్యక్షుడు కల్లెపు అజయ్, భీమదేవరపల్లి మండల అధ్యక్షుడు నద్దునూరి జయకృష్ణ, చెల్పూరి వినోద్, మొలుగూరి అరవింద్, మండ శ్రావణ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.