విజయనగరం జనసేన ఆధ్వర్యంలో యువశక్తి పోస్టర్ ఆవిష్కరణ

విజయనగరం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రణస్థలంలో జరగనున్న యువశక్తి కార్యక్రమం గురించి మాట్లాడటానికి విజయనగరం నియోజకవర్గంలో మండల మరియు గ్రామాల నాయకులతో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు పాల్నగరలోని విజయనగరం జనసేన పార్టీ ఆఫీస్ లో సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ మరియు తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథులు గా పాల్గొన్నారు. జనసేన నాయకులు, వీరమహిళలు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.