11 వ వారం ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం

పిఠాపురం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో, జిల్లా జనసేన అధ్యక్షులు కందుల దుర్గేష్ చేతులపై ప్రారంభోత్సవం చేయబడి జనసేన నాయకులు పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాస్ వారు ఏర్పాటుచేసిన శ్రీమతి డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రం నందు ప్రతి శనివారం పిఠాపురం పశువుల సంత వద్ద రైతులకు అన్నసదుపాయమును కల్పించుచున్నారు. 11వ వారం శనివారం 700 మంది రైతులకు, పశువుల బేరాల మధ్యవర్తులకు, వివిధ హాస్పటల్ కి వచ్చి ఔట్ పేషెంట్లకు కలిపి అన్న సదుపాయమును కల్పించారు. శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నసదుపాయ కేంద్రం నందు పిఠాపురం నగర జనసేన నాయకులు అల్లం కిషోర్, ముత్యాల లోవరాజు, అల్లం వాసు, పొట్లూరు గణేష్, అల్లం శివ, జ్యోతుల నాని, వెదురుపాక దుర్గాప్రసాద్, ఇప్పర్తి శీను, తదితరులు తమ సేవలను అందించారు. వీరిని చరవాణి ద్వారా జ్యోతుల శ్రీనివాసు ప్రశంస్తూ శ్రీమతి డోక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రమునకు అనేకమంది ఈ విధంగా తమ సేవలందిస్తున్నారని వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేయుచున్నానని ఇందుమూలంగా జ్యోతుల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలియజేశారు.