కాయింతాలమ్మ తల్లి జాతర మహోత్సవంలో పాల్గొన్న గురుదత్ ప్రసాద్

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, కలవచర్ల గ్రామంలో కాయింతాలమ్మ తల్లి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారి ఊరేగింపులో ఆలయ కమిటీ వారి ఆహ్వానం మేరకు రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్య సమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ హాజరయ్యారు. ఈ కార్యక్రమలో రాజానగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర పాల్గొన్నారు.