వారాహి యాత్ర విజయవంతం కావాలని సర్వమత ప్రార్ధనలు
చింతలపూడి: జూన్ 14న జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నవరం నుండి యాత్ర ప్రారంభించిన సందర్బంగా జంగారెడ్డిగూడెం పట్టణం మరియు మండల కమిటీల ఆధ్వర్యంలో సర్వమత ప్రార్ధనలు చింతలపూడి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ మేకా ఈశ్వరయ్య సమక్షంలో జరిగినవి. మొదటి గాసిఎస్ఐ చర్చిలో పాస్టర్ దాసరి పిన్నిబాబు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ తలపెట్టిన వారాహి యాత్ర ఏ ఆటంకం లేకుండా విజయవంతం కావాలని జనసేన నాయకులు, వీరమహిళల నుద్దేశించి ప్రార్ధన చేసినారు. అలాగే స్థానిక బిలాల్ మసీద్ లో మత గురువు అటీక్ ఖాన్, ఉమర్ అలీ గార్లు ప్రార్ధన చేసి దీవించారు. చివరిగా గంగాణమ్మ గుడి దగ్గర ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి గుడిలో పూజలు చేసి శ్రీ పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర విజయవంతం కావాలని, ఏ ఆటంకం లేకుండా అన్ని జిల్లాల్లో విజయవంతం కావాలని ఆశీర్వదం తెలిపినారు. ఈ కార్యక్రమంలో మండలం అధ్యక్షులు ఆకుల రాకేష్, పట్టణ అధ్యక్షులు షేక్ పీరు, బాధరాల నరేష్, సూరవరపు శేషు, యడ్ల చంటి, శ్రీమతి డి రాజీ, శ్రీమతి కోసూరి కనకమహాలక్ష్మి, ఊదర భాస్కరరావు, దోసూరి నాగేశ్వరరావు తదితర జనసేన నాయకులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-14-at-2.50.04-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-14-at-2.50.05-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-14-at-2.50.07-PM-1024x768.jpeg)