జనసైనికులకు అండగా నిలచిన బాబు పాలూరు

పార్వతీపురం నియోజకవర్గం: సీతానగరం మండలం డి.కె పట్నం గ్రామంలో ఎమ్మెల్యే పర్యటనలో భాగంగా గ్రామ ప్రజలు, యువత తాగునీటి సమస్య గురించి ఎమ్మెల్యే జోగారావునీ గారిని ప్రశ్నించగా
తర్వాత చెబుతాను అని మాట దాటేయ్యడం, చివర్లో జనసైనికులుని రెచ్చగొట్టేలా ఎమ్మెల్యే బాయ్ బాయ్ జనసైనికులు అనడం సమస్యకు సమాధానం చెప్పకుండా ఎమ్మెల్యే వెళ్లిపోతుండగా ప్రజలకు
జనసైనికులు అడ్డుపడటంతో కారు వారిపై నుంచే తీసుకుపోండి అనడంతో అక్కడ జరిగిన సంఘటనలో అక్రమంగా 4గురు జనసైనికులనీ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లడం తెలిసిన వెంటనే జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాబు పాలూరు తక్షణమే పార్వతీపురం చేరుకొని వెంటనే ఎస్.ఐ ని కలిసి మాట్లాడగ మా జనసైనికులునే వెంటనే విడుదల చెయ్యలని కోరగా ఎస్.ఐ సానుకూలంగా స్పందించి, కేసు నమోదు చెయ్యాకుండా సంతకాలు తీసుకోని సొంత పూచికత్తుతో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డి.కె పట్నం గ్రామ ప్రజలు మా పిల్లలను బయటకు తీసుకువచ్చిన బాబు పాలూరుకి రణపడి ఉంటాము అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం మండల అధ్యక్షురాలు ఆగూరి మణి, చిట్లి గణేష్, గారా గౌరీ శంకర్, ఖాతా విశ్వేశ్వర్ రావు, చందక అనిల్, రాజనా రాంబాబు, సీతానగరం మండల అధ్యక్షుడు పాడ్డి శ్రీను, అనంత్, మణి, చీమల సతీష్, బొనెల గొవిందమ్మ, గాండ్రేటి గౌరీ, సురేష్, జనసేన నాయకులు, జనసేనకులు, వీరమహిళలు పాల్గొన్నారు.