ఘనంగా క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం

సత్తెనపల్లి నియోజకవర్గం, సత్తెనపల్లి నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో ఆదివారం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం సత్తెనపల్లి నియోజకవర్గం నాయకులు బొర్రా వెంకట అప్పారావు చేతుల మీదుగా నియోజకవర్గంలోని మండల అధ్యక్షులు రాజుపాలెం మండల అధ్యక్షులు తోట నరసయ్య, నకరికల్లు మండల అధ్యక్షురాలు తాడువాయి లక్ష్మి శ్రీనివాస్, సత్తెనపల్లి మండలం అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరరావుల ఆహ్వానం మేరకు నిర్వహించడం జరిగింది. మొదట రాజుపాలెం మండల జనసేన పార్టీ ఆఫీస్ నందు మండల అధ్యక్షులు తోట నరసయ్య ఆధ్వర్యంలో మండల కమిటీ సమావేశం మరియు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. క్రియాశీలకు సభ్యత్వ కిట్లు పంపిణీ కార్యక్రమం సత్తెనపల్లి జనసేన పార్టీ నాయకులు బొర్రా వెంకట అప్పారావు చేతుల మీదుగా అందించడం జరుగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కార్యకర్తల కుటుంబ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి ఐదు లక్షల భీమా సౌకర్యాన్ని కల్పించారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాలుగు మండలాల అధ్యక్షులు రాజుపాలెం మండల అధ్యక్షులు, ముప్పాల మండల అధ్యక్షులు సిరిగిరి పవన్, సత్తెనపల్లి రూరల్ మండల అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరావు, నకరికల్లు మండల అధ్యక్షులు తాడువాయి లక్ష్మి శ్రీనివాస్, రాజుపాలెం మండల ఉపాధ్యక్షులు బత్తుల హనుమంతరావు, మొక్కపాడు గ్రామ అధ్యక్షులు శీను, రాజుపాలెం గ్రామ అధ్యక్షులు కోటేశ్వరరావు, అనుపాలెం గ్రామ అధ్యక్షులు తోట లక్ష్మీనారాయణ, మండల కార్యదర్శి రుసు వెంకటేష్, పెమ్మా రమేష్, తోట హరిబాబు, జనసేన సీనియర్ నాయకులు, జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు, జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అనంతరం నకరికల్లు మండల జనసేన పార్టీ కార్యాలయంలో, మధ్యాహ్నం సత్తెనపల్లి మండలంలోని ధూళిపాళ్ల జనసేన పార్టీ కార్యాలయంలో సభ్యత్వ కిట్లు పంపిణీ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్లు, మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు, జనసైనికులు మరియు వీర మహిళలు పాల్గొని క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగినది.