జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్స్ పంపిణి

పాలకొండ నియోజకవర్గం: వీరఘట్టం మండల కేంద్రంలో జనసేన పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన క్రియాశీలక సభ్యత్వం కిట్లు పంపిణీ కార్యక్రమనికి ముఖ్య హాజరైన నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, క్రియాశీలక సభ్యత్వం వాలంటీర్ మత్స పుండరీకం జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్తలకు 5 లక్షల రూపాయల జనసేన బీమా కిట్స్ పంపిణిచేశారు. అనంతరం క్రియాశీలక సభ్యులందరి చేత క్విట్ జగన్.. క్విట్ వైస్సార్సీపీ.. నినాదాలు చేయించారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్ మత్స పుండరీకం మాట్లాడుతూ.. జనసేన పార్టీకి, ప్రజలకు క్రియాశీల సభ్యులు వారధిగా నిలవాలని జనసేన పార్టీ సిద్ధాంతాలను ఇంటి ఇంటికి చేరవేసే విధంగా అందరూ కృషి చేయాలని, ప్రతి గ్రామంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులంతా కలిసికట్టుగా ఒకే లక్ష్యంతో పని చేయాలని జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, జనసేన పార్టీని గ్రామ స్థాయిలో, బూతు స్థాయిలో బలోపేతం చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రియాశీలక సభ్యులతో పటిష్టమైన ప్రణాళికలతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని, రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపు తథ్యం అని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు సాధు జనార్ధన్, మత్స కృష్ణా రావు, చింతా గోవర్ధన్, కంటు రఘు, గెఒబలి లోకేష్, మత్స కాసియ్య, గెంబలి సాయి, తదితర జనసైనికులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.