వారాహి యాత్రను విజయవంతం చెయ్యండి: డా. వెంకటలక్ష్మి

కైకలూరు: జనసేనాని పవన్ కళ్యాణ్ చేపట్టిన నాలుగవ విడత వారాహి విజయ యాత్ర లో భాగంగా అక్టోబర్ 5వ తేదీన కైకలూరు నియోజకవర్గంలో జరగబోవు బహిరంగ సభకి భారీ ఎత్తున హాజరై, సభ విజయవంతం చేయాలని బుధవారం కొల్లేరు ప్రాంతానికి చెందిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి డా.ఘంటసాల వెంకటలక్ష్మి కైకలూరు నియోజకవర్గం, కైకలూరు మండలములోని కొల్లేరు గ్రామాల్లో పర్యటించి కొల్లేరు గ్రామాల పెద్దలని, ప్రజలని కోరారు.