కుర్ల రాజశేఖర్ రెడ్డి సమక్షంలో జనసేనలో చేరికలు

అల్లూరి జిల్లా, రంపచోడవరం నియోజవర్గం, శనివారం రంపచోడవరం మండలం ముసురుమిల్లి గ్రామం నందు జనసేన నాయకులు కుర్ల రాజశేఖర్ రెడ్డి సమక్షంలో 15 కుటుంబాలు ఘనంగా జనసేనలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజురోజుకి పెరుగుతున్న గిరిజన ప్రాంతాల్లో జనసైన్యం రానున్న రోజుల్లో పార్టీ మరింత బలోపేతానికి కృషి చేస్తానని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాల్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్తామని రాజశేఖర్ రెడ్డి తెలిపారు.