కార్తీకమాస వనసమారాధన మహోత్సవం

అమలాపురం: అల్లవరం మండలం, బోడసకుర్రు దేవర్లంక పి ఎం ఎవై -వై ఎస్ ఆర్ జగనన్న నగర్ లో టిడ్కోకాలనీ సి 5బ్లాక్ వద్ద పాలెపు సుబ్బలక్ష్మి -నాగేశ్వరరావు దంపతులు ఆధ్వర్యంలో కార్తీక మాస తొలి ఆదివారం తొలి వనసమారాధన జరిగింది. తులసి చెట్టు, ఉసిరి చెట్టు వద్దశ్రీపార్వతి పరమేశ్వరుల, వినాయక, కుమారస్వామి, శ్రీలక్ష్మి దేవి, శ్రీ వేఒకటేశ్వరస్వామి ఉన్న చిత్ర పటాలకు, పూజలుచేసారు. శివ కేశవులకు, హిందూ సాంప్రదాయాలకు అత్యంత ప్రీతి కరమైన మాసం కార్తీక మాసం పూజ అనంతరంవిచ్చేసిన వారికీ అన్న ప్రసాదవితరణ జరిగింది. హైదరాబాద్ కు చెందిన క్రియాన్స్ ప్రామినెంట్ కెమికల్స్ కు చెందిన శివశంకర్ శ్రీనివాస్ వాసంశెట్టి వన సమారాధనకు సహాకరించారు. ఈ సందర్బంగా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎ రాజు, నూకల రామ్మోహన్ రావు, నూకల గోపాలకృష్ణ, మద్దులసతీష్, వర్రే త్రిమూర్తులు, గారపాటి వెంకట రంగప్రసాద్, ఆది లక్ష్మి, ఈశ్వరి, జ్ఞానేశ్వరి, మణి, మంగతాయారు, దేవి, హేమ, భాగ్య లక్ష్మి తదితరులు ఫాల్గొన్నారు.