దివ్యంగ చిన్నారుల భవన నిర్మాణ భూమి పూజ

ఇచ్చాపురం: ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఆదివారం సీతయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన దివ్యంగ చిన్నారులకు భవనంకై జిల్లాలో మొదటి అవయధాత అయిన కీ.శే మల్లారెడ్డి కిరణ్ చంద్ జ్ఞాపకార్థంగా సజీవంగా సేవలు అందించడానికి సీతయ్య ఫౌండేషన్ లో భవన నిర్మాణ భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కిరణ్ చంద్ తల్లి, తండ్రి, జనసేన సమన్వయ కర్త దాసరి రాజుగారు రావడం జరిగింది. అలాగే పలు స్వచ్ఛంద సేవా సంస్థలు వచ్చి భాగస్వామ్యం అయినారు. అనంతరం సీతయ్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు గుల్ల రమేష్ సిబ్బంది ఆధ్వర్యంలో ముఖ్య అతిధులచే సేవా సంస్థలకు సన్మానించి ఫీల్డ్ అందించి అభినందించారు. కార్యక్రమంలో అన్నవరం హెల్పింగ్ హాండ్స్ సభ్యులు, రక్షణ ఫౌండేషన్ సభ్యులు చుట్టు ప్రక్కల గ్రామ ప్రజలు యువత పాల్గొన్నారు.