కాకినాడ సిటి జనసేన ఆధ్వర్యంలో ప్రజా చైతన్య పోరాటం

కాకినాడ సిటి: కాకినాడ సిటి జనసేన పార్టీ కార్యాలయంలో పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో ఎన్.సత్తిబాబు ఆధ్వర్యంలో 8వ డివిజన్ కొత్త కాకినాడ ప్రాంతంలో ప్రజా చైతన్యపోరాటం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న జనసేన పార్టీ శ్రేణులు స్థానిక ప్రజలతో కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడారు. స్థానికులు మాట్లాడుతూ అష్టకష్టాలు పడి పిల్లలని చదివిస్తూన్నామనీ కానీ డిగ్రీలు చదివాకా ఉద్యోగాలకోసం వేరే రాష్ట్రాలకి వలసపోవాలిసి వస్తోందనీ, ముసలితనంలో తమకు ఆసరాగా వాళ్ళు ఉండే అవకాశంలేక మనసులో దిగులుతో ఆరోగ్యాలు పాడవుతున్నాయన్నారు. కొంతమంది నిరుద్యోగులు మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తాదని చూసి చూసి కళ్ళు కాయలు కాచాయి కానీ నోటిఫికేషన్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. జనసేన నాయకులు మాట్లాడుతూ ఈ అవినీతి వై.సి.పి ప్రభుత్వం ప్రజలు బాగుపడితే ఎక్కడ తన చేతినుండీ జారిపోతారో అని బతకనివ్వకుండా అలా అని చావనివ్వకుండా చేస్తోందనీ, ఇంకో మూడునెలల్లో రాష్ట్రానికి పట్టిన పీడ పోతాదనీ అంతవరకూ ఓపికపట్టవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్.సత్తి బాబు,కె. రామకృష్ణ, ఎన్. గోవింద్, ఎన్. సురేష్, వి. చిన్న, వి. సూరి, జి. దుర్గ, బండి సుజాత,యేలేటి సోనీ ఫ్లోరెన్సు, బోడపాటి మరియ, సబ్బే దీప్తి, మోర్త రమణమ్మ, దూలపల్లి ఉమ తదితరులు పాల్గొన్నారు.