తంబళ్లపల్లి రమాదేవిని కలసిన కోనాయిపాలెం గ్రామస్తులు
నందిగామ నియోజకవర్గం: చందర్లపాడు మండలం, కోనాయిపాలెం గ్రామంలో బుధవారం నందిగామ పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయానికి కోనాయిపాలెం గ్రామస్తులు మర్యాదపూర్వకంగా నందిగామ జనసేన సమన్వయకర్త శ్రీమతి తంబళ్లపల్లి రమాదేవిని కలిశారు. అనంతరం కోనాయిపాలెంలోని సమస్యలను రమాదేవికి వివరించి, అక్కడ ప్రజలు జనసేనకు పూర్తిగా మద్దతిస్తామని మాటిచ్చారు. నందిగామకి మూడు జీవ నదులు ఉన్నప్పటికీ తాగునీరు సాగునీరు సమస్యలు ఉన్నాయని, ఈమధ్య వచ్చిన మిచాంగ్ తుఫాను కారణంగా నష్టపోయిన రైతుల పట్ల ఈ వైసీపీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణికి 2024 ఎన్నికల్లో ప్రజలంతా కలిసి బుద్ధి చెప్తామని, వారందరూ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చందర్లపాడు మండల అధ్యక్షుడు వడ్డెలు సుధాకర్, కోనాయిపాలెం గిరి, కొనాయిపాలెం గ్రామస్తులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-27-at-10.11.39-PM-1024x768.jpeg)