పలు కుటుంబాలకు డిఎంఆర్ శేఖర్ ప్రగాఢ సానుభూతి

అమలాపురం: ఇటీవల కాలం చేసిన మద్దింశెట్టి వీర్రాజు, నల్లా సత్యవేణి కుటుంబ సభ్యులకు జనసేన అమలాపురం నియోజకవర్గ పార్లమెంట్ ఇంచార్జ్ డిఎంఆర్ శేఖర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమానికి డిఎంఆర్ శేఖర్ తో జనసేన అమలాపురం పార్లమెంట్ గౌరవ అధ్యక్షులు నల్లా శ్రీధర్, జనసేన ఉప్పలగుప్తం మండల అధ్యక్షుడు ఆకుల సూర్యనారాయణ మూర్తి, చల్లపల్లి గ్రామ సర్పంచ్ ఇసుకపట్ల రఘుబాబు, నల్లా వెంకటేశ్వరరావు, పైపుడి వీరేంద్ర తదితరులు పాల్గొన్నారు.