కందుల ఉషారాణి పెద్దకార్యంలో పాల్గొన్న పితాని

రాజమండ్రి: జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ సతీమణి కందుల ఉషారాణి ఇటీవల స్వర్గస్తులయ్యారు. గురువారం వారి పెద్దకార్యంలో పాల్గొన్న రాష్ట్ర జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ.
వీరివెంట జనసేనపార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ జక్కంశెట్టి బాలకృష్ణ(పండు), జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సానబోయిన మల్లికార్జునరావు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు గోదాశి పుండరీస్, సానబోయిన వీరభద్రరావు, గాలిదేవర బుల్లి, పితాని రాజు, మాదాల శ్రీధర్, గాలిదేవర రాము మొదలగువారు ఉన్నారు.