పలుకుటుంబాలకు జనసేన-టిడిపి అండ

గోపాలపురం, యాదవోలు గ్రామంలో కాలం చేసినటువంటి అనిశెట్టి సీతారామయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేయడానికి, అదేవిధంగా గ్రామంలో ఇటీవల మరణించినటువంటి వన్నపు అమ్మాజీ, పొట్టి విశ్వేశ్వరరావులు ఇటీవల మరణించారు వారి కుటుంబాలను కూడా పరామర్శించడం జరిగింది. ఈ రెండు దళిత కుటుంబాలకు జనసేన మరియు టిడిపి నాయకులు 10వేల రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోపాలపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జి దొడ్డిగర్ల సువర్ణ రాజు, యాదవోలు జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు అనిశెట్టి శ్రీనివాస్, మాజీ టిడిపి ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, టిడిపి సీనియర్ నాయకులు చిన్నబాబు, దుర్గారావు, అనిశెట్టి ప్రభాకర్ రావు, మధు అనిశెట్టి, మొగల్తూరు సత్తుపండు, రావూల సతీష్, అక్కిశేట్టి బాలకృష్ణ, వెంకీ జనసెనిక్ అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు జనసైనికులు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.