జయహో బిసి సరస్సులో పాల్గొన్న పోతుల సాయినాథ్
తంబళ్లపల్లె నియోజకవర్గం: మలకలచెరువు హెడ్ క్వాటర్ లో జయహో బీ సీ కార్యక్రమం తంబళ్లపల్లె నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు శంకర్ యాదవ్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో తంబళ్లపల్లె నియోకవర్గ జనసేన పార్టి ఇంచార్జ్ పోతుల సాయినాథ్ మాట్లాడుతూ బీసీ కులాలకు అగ్రస్థానం కల్పించామని చెప్పుకుంటున్న ఈ వైసీపీ గవర్నమెంట్ బీసీ కార్పొరేషన్ తుంగలో తొక్కింది. అన్ని నామినేటెడ్ పదవుల్లో ముఖ్యమంత్రి గారి సామాజిక వర్గానికి మాత్రమే పెద్ద పీట వేసినా ఘనత మన ముఖ్యమంత్రి గారికి చెందుతుంది. అన్ని బీసీ కులాలు చట్టసభల్లో సమాన హక్కులకై పోరాడాలి రాష్ట్రంలో 151 మంది ఎమ్మెల్యేలతో 22 మంది ఎంపీలతో అద్భుతమైన తీర్పు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి చేసింది ఉద్యోగము ఉపాధి రాజధాని లేని రాష్ట్రంగా తయారుచేసి కల్తీ నిక్కరు ల్యాండ్ సాండ్ మాఫియా ముఠాలను తయారు చేశారు. రాష్ట్రాన్ని చిన్నా భిన్నం చేసిన ఘనత మన ముఖ్యమంత్రికే దక్కుతుంది ఈ అరాచక దౌర్జన్య ప్రభుత్వాన్ని పారదోలాలి అన్నా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వైసిపి విముక్తా ఆంధ్ర ప్రదేశ్ అనే నినాదం అన్నాడో ఇ ఆ నినావాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాము అలాగే వైసిపి విముక్తా తంబళ్లపల్లి అనే సంకల్పంతో ఆరు మండలంలోని జైహో బీసీ కార్యక్రమం చేపడుతున్నాము కనుక నియోజకవర్గంలోని అన్ని బీసీ కులాలు ఏకతాటిపై వచ్చి వైఎస్ఆర్ అరాచకత్వాన్ని తరిమి కొట్టి అబివృద్ధి పతం లో నడవాలి అంటే జనసేన&తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్హిని గెలిపించాలని కొరారు కార్యక్రమంలో తంబళ్లపల్లి మండల ఉపాధ్యక్షులు పవన్ రెడ్డి గారు కురబలకోట మండల అద్యక్షుడు దామోదర్, ములకలచెరువు మండల ఉపాధ్యక్షుడు ఎస్ లక్ష్మణ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-03-at-3.40.58-PM-1024x461.jpeg)