బుల్లెట్ ధర్మారావును మర్యాదపూర్వకంగా కలిసిన పీలేరు జనసేన నాయకులు

ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో రాధా రంగా మిత్రమండలి మరియు ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన కార్యదర్శి కలప రవి ఆధ్వర్యంలో కీర్తిశేషులు వంగవీటి మోహన రంగా అనుచరులు, రాధా రంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావును చెన్నై జనసేన టీం ఆత్మీయ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని తిరుగు ప్రయాణంలో మార్గమధ్యంలో పీలేరు నందు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించడం జరిగినది. ఈ సందర్భంగా బుల్లెట్ ధర్మారావు మాట్లాడుతూ పీలేరు నియోజకవర్గంలోని రంగా అభిమానులకు పవన్ కళ్యాణ్ అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ రంగా ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. రంగా అందరివాడు ఆయనకు కులము లేదు, మతం లేదు. ఆయనకు అన్ని కులాల్లో అభిమానులు ఉన్నందున ఉమ్మడి రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు లక్షల 50 వేల విగ్రహాలు పైగా ఉన్న ఏకైక ప్రజా నాయకుడు వంగవీటి మోహనరంగా. అదే ఆశయాలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్ని కులాల వారిని కలుపుకుంటూ ఆయన ముందుకు సాగుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీకి రాధా రంగా మిత్రమండలి మద్దతు పలుకుతూ రాబోయే ఎన్నికలలో పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ ఉమ్మడి అభ్యర్థులు ఎవరికైతే కేటాయిస్తారో ఆ అభ్యర్థిని భారీ మెజారితో గెలిపిస్తామని బుల్లెట్ ధర్మారావు ఈ సందర్భంగా తెలియజేసారు. ఈ కార్యక్రమానికి నాయకులు రాధా రంగా మిత్రమండలి ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణ ప్రసాద్, అనిల్ రాయల్, తులసి యాదవ్, వెంకన్న, కలప రవి మరియు రంగా అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు.