వాసాల తిప్పలో టీడీపీ అభ్యర్థి ఆనందరావు ప్రచారం

కోనసీమ జిల్లా: అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం కూటమి తెలుగు దేశం అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అయితా బత్తుల ఆనందరావు మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉప్పలగుప్తం మండలం, వాసాలతిప్పలో ఇంటింటా ప్రచారం చేస్తు సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి అని ఓటర్లను అభ్యర్దించారు. ఈ ప్రచారంలో అమలాపురం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పెచ్చెట్టి విజయలక్ష్మి, తెలుగు దేశం రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి కర్రి రామస్వామి (దత్తుడు ), దేశం శెట్టి లక్ష్మి నారాయణ, దాసం గోపి, జనసేన నాయకులు నల్లా శ్రీధర్, పడాలనానాజీ, తదితరులు పాల్గొన్నారు.