నిరుల్లి, కూరగాయల సంఘ సభ్యులతో బొలిశెట్టి సమావేశం

తాడేపల్లిగూడెం: బ్రహ్మానందరెడ్డి మార్కెట్ నందు నిరుల్లి కూరగాయలు సంఘం పెద్దలు, జట్టు కార్మికులు, గుమస్తాలతో సమావేశం అయిన జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి ఉమ్మడి అభ్యర్ధి బొలిశెట్టి శ్రీనివాస్ సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజాసేవ చేసేందుకు మాత్రమే రాజకీయాల్లోకి వచ్చానని, అందరి అభివృద్ధి మాత్రమే తన ధ్యేయమని తెలియచేస్తూ మార్కెట్ తో చిన్న నాటినుండి తనకున్న అనుబంధం గుర్తు చేసుకున్నారు. గతంలో మున్సిపల్ చైర్మన్ గా తాను పనిచేసినప్పుడు చేసిన అభివృద్ధి గురించి ఇప్పటి ప్రభుత్వం యొక్క అసమర్థ పాలన గురించి తెలియచేసారు. మార్కెట్ లోని పెద్దలు నంద్యాల కృష్ణ మూర్తి మాట్లాడుతూ అందరికీ కావాల్సిన మంచి వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆయనను గెలిపించుకోవటం అందరి బాధ్యత అని తెలియచేసారు. కార్మికులు, గుమస్తాలు కలిసి ఆయనకు గాజు గ్లాస్ గుర్తు మీద ఓటు వేసి అత్యంత అఖండ మెజారిటీతో గెలిపిస్తామని తెలియచేసారు.