కామినేని శ్రీనివాస్ గెలుపుకు కృషి చేస్తున్న కొత్తపల్లి జనసేన-తెలుగుదేశం

కైకలూరు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అదేశాల మేరకు ఏలూరు పార్లమెంట్ ఉమ్మడి ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్, కైకలూరు నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డా. కామినేని శ్రీనివాస్ లకు మద్దత్తుగా ప్రచారంలో భాగంగా ముదినేపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో గడప గడపకు తిరుగుతూ ప్రజలకు కామినేని శ్రీనివాస్ రావడం వలన జరిగే మేలు వివరించారు. గత ఐదు సంవత్సరాల నుండి నియోజకవర్గం లో దోపిడీ దారుల పాలన ఎక్కువ అయిపోయింది అని కనీసం గ్రామాలలో అభివృద్ధి జరగలేదు అని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేని వారిని కాకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి పని చేసే నాయకులకు ఓటు వేయాలి అని, ఎన్.డి.ఏ అభ్యర్థి కామినేని శ్రీనివాస్ కి మాత్రమే సాధ్యం గనుక శ్రీనివాస్ ని కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. కామినేని శ్రీనివాస్ రాగానే గ్రామంలో ఉన్న ప్రతి సమస్యకు తెలుగుదేశం నాయకులు, జనసైనికులు అందరం కలిసి పరిస్కారం అయ్యే విధంగా కృషి చేస్తాము అని హామీ ఇచ్చారు. ఎవరికి ఏ సమస్య వచ్చిన అందరం మీకు అందుబాటులో ఉంటాము గనుక ఈసారి ఉమ్మడి అభ్యర్థి ని గెలిపించాలని తెలిపారు. ఈ సందర్బంగా ప్రజలకు ఈవీఎం మెషిన్ పై ఉన్న క్రమ సంఖ్యలో మొదట ఎంపీ అభ్యర్థికి 4వ సంఖ్య సైకిల్ గుర్తు పై నొక్కి పుట్టా మహేష్ ని, రెండవ సారి ఎమ్మెల్యే అభ్యర్థికి 1వ సంఖ్య కమలం గుర్తుపై నొక్కి కామినేని శ్రీనివాస్ కి ఓటు వేయాలి అని తెలియచేసారు.