వ్యాక్సిన్ తీసుకున్న గుజరాత్ క్రీడాశాఖ మంత్రికి కరోనా పాజిటివ్..

గాంధీనగర్: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో వైరస్ కట్టడికి చర్యలు కూడా ముమ్మరమయ్యాయి. మరోవైపు కరోనా నుంచి కాపాడేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. తాజాగా గుజరాత్ క్రీడాశాఖ మంత్రి ఈశ్వర్ సింగ్ పటేల్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం ఈశ్వర్ సింగ్ యూఎన్ మెహతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈశ్వర్ సింగ్ మార్చి 13న కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. అయినా కూడా అతనికి కరోనా పాజిటివ్ వచ్చింది. కాగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 3,29,47,432 మందికి కరోనా టీకాలు వేశారు. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం మహారాష్ట్ర, పంజాబ్, కర్నాటక, గుజరాత్, తమిళనాడులలో కోవిడ్-19 కేసులు అధికంగా నమోదవుతున్నాయి. దేశంలో నమోదవుతున్న కేసులలో 78.41 కేసులు ఈ రాష్ట్రాలలోనే ఉన్నాయి.