భారత్ ‌కు మరో 10 రాఫెల్‌ విమానాలు

ఇండియా వాయుసేన సామర్థ్యం మరింత పెరుగనుంది. త్వరలో మరో 10 రాఫెల్‌ యుద్ధ విమానాలు భారత్‌కు చేరనున్నాయి. ఇప్పటికే వాయుసేనకు 11 రాఫెల్‌ విమానాలు అందగా కొత్తవాటి రాకతో మొత్తం 21 అవుతాయి. మూడు రోజుల్లో మూడు రాఫెల్‌ విమానాలు ఫ్రాన్స్‌ నుంచి రానున్నాయని.. వచ్చే నెలలో మరో 7 రాఫెల్‌ విమానాలు వస్తాయని ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు. మొత్తం 36 విమానాలను ఇండియా కొనుగోలు చేసింది. కాగా.. మొత్తం 36 రాఫెల్‌ యుద్ధ విమానాల కోసం 2016లో ఇండియా ఫ్రెంచ్‌ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. కొన్ని విమానాలు గత ఏడాది జులై-ఆగస్టుకు ఇండియా చేరుకోగా.. వాటిని వైమానిక దళంలోకి ప్రేవేశపెట్టారు.