బంగ్లాదేశ్లో పడవ ప్రమాదం.. 25 మంది మృతి
బంగ్లాదేశ్లో ఘోర పడవ ప్రమాదం సంభవించింది. పద్మ నదిలో దాదాపు 30 మందితో ప్రయాణిస్తున్న ఓ పడవను ఓ ఇసుక రవాణా ఓడ ఢీకొంది. శిబ్చార్ పట్టణం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. మరో ఐదుగురిని కాపాడినట్లు పోలీసు అధికారి మిరాజ్ హుస్సేన్ పేర్కొన్నారు. మరికొందరి ఆచూకీ తెలియాల్సి ఉందని.. వారి కోసం అగ్నిమాపక సిబ్బంది, స్థానిక రెస్క్యూ టీం గాలిస్తున్నట్లు మిరాజ్ హుస్సేన్ వెల్లడించారు.