గులాబ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి… రైతుల తరపున పోరాడతామన్న తణుకు జనసైనికులు..!
గులాబ్ తుఫాను ప్రభావం వలన కురిసిన భారీ వర్షాల వలన తణుకు నియోజకవర్గం లోని వయ్యేరు కాలువ ఉదృతంగా ప్రవహించటం వలన నీట మునిగిన పంటపొలాలను పరిశీలించి రైతులకు వెన్నుదన్నుగా తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ ఉంటుందని తెలియపరచటం జరిగింది. ఈ రోజు జనసేన పార్టీ తరపున గెలిచిన తిరపతిపురం గ్రామ సర్పంచ్ శ్రీ కోడూరి మణికంఠ గారి తో పాటు గా జనసేన నాయకులు కార్యకర్తలు రైతులతో ముంపు ప్రాంతాలలో పర్యటించి వారి తరుపున ప్రభుత్వం పై పోరాడి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కలిగే వరకూ పోరాడతామని తెలియచేశారు.
అత్తిలి మండలం తిరుపతిపురం గ్రామం లో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల వలన పొట్ట దశ ఉన్న పంట పొలాలు పూర్తిగా మునిగి పోయి తీవ్రంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణ సాయం కింద 25000/- రూ నష్ట పరిహారం చెల్లించాలని కోరుతూ రైతులు తరుపున డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో తిరపతిపురం గ్రామ సర్పంచ్ శ్రీ కోడూరి మణికంఠ గారి తో పాటు గా జనసేన నాయకులు అనుకుల రమేష్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/10/WhatsApp-Image-2021-10-02-at-12.43.33-AM-1-1024x470.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/10/WhatsApp-Image-2021-10-02-at-12.43.30-AM-1024x470.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/10/WhatsApp-Image-2021-10-02-at-12.43.35-AM-1024x470.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/10/WhatsApp-Image-2021-10-02-at-12.43.33-AM-2-1024x470.jpeg)