మరోసారి ‘డబుల్ ఇంజిన్’ ప్రభుత్వాన్ని గెలిపించండి ..
గోవా స్వయం సమృద్ధికి మరోసారి ‘డబుల్ ఇంజిన్’ ప్రభుత్వాన్ని గెలిపించాలని ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు. గోవాలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ విజ్ఞప్తి చేశారు. ‘ఆత్మనిర్భర్ భారత్ స్వయంపూర్ణ గోవా ప్రోగ్రామ్’ లబ్ధిదారులు, భాగస్వాములతో శనివారం వీడియో కాన్ఫరెన్స్తో ద్వారా మోడీ సంభాషించారు. స్వయంపూర్ణ గోవా కార్యక్రమం ద్వారా మహిళలకు ఆరోగ్యం, యువతకు, నిరుద్యోగులకు ఉపాధి హామీ లభిస్తుందని మోడీ తెలిపారు.