పట్టాలెక్కిన కేజీఎఫ్ చాప్టర్ 2

కేజీఎఫ్ మూవీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్. హోంబాలే ఫిల్మ్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌కి కరోనా కారణంగా బ్రేకులు పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి షూటింగ్‌లకు అనుమతి రావడంతో బుధవారం నుంచి ఈ సినిమా షూటింగ్‌ బెంగళూరులో పునః ప్రారంభమైంది. ఈ విషయం గురించి దర్శకుడు ప్రశాంత్ నీల్  కొన్ని రోజుల ముందే ప్రకటన చేసి ఆగస్టు 26 నుంచి షూటింగ్ షురూ అన్నాడు. తాజాగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ట్వీట్ చేసి బ్యాక్ టు వర్క్ ( షూటింగ్ ) అని కేజీఎఫ్ చాప్టర్ 2లో తను చేస్తున్నట్టు ఇలా ప్రకటించాడు. యష్ హీరోగా వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 1లో అనంత్ నాగ్ చేసిన రోల్ లో ప్రకాష్ రాజ్ రీప్లేస్ అయినట్టు తెలుస్తోంది.

కేజీఎఫ్ 1 జాతీయ స్థాయిలో మంచి విజయం సాధించడంతో మేకర్స్ ఈ మూవీకి సీక్వెల్ ను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.